బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె ప్రగతిభవన్ చేరుకుని కేసీఆర్ ని కలిశారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఉన్నారు. రెండు రోజులు పాటు ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు కవిత వివరించినట్లు సమాచారం. కాగా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారణ చేసింది. మార్చి 11న మొదటి సారి విచారణ చేయగా.. మార్చి 20,21వ తేదిల్లో వరుసగా రెండు సార్లు విచారించారు. మరోసారి కూడా కవితను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం
Follow us on: Youtube Instagram