స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు హెచ్ఎండిఏ కమిషనర్. ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు హెచ్ఎండిఏ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను.. 48 గంటలలోపు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అసత్య ఆరోపణలకు గాను హెచ్ఎండిఏ కమిషనర్ కు క్షమాపణలు చెప్పాలని నోటీసులలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.