స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలకు చలగల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అంతా తడిసిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు.. జగిత్యాల- నిజామాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.