స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో చేప మందు ప్రసాదం పంపిణీపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు విషయాలు వెల్లడించారు. జూన్ 9న చేప పిల్లల ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. మంత్రి తలసానితో బత్తిన సోదరులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి చేప పిల్లల ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.