తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Santhi Kumari)కి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పగించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఇటీవల సీఎస్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఆమె రికార్డు సృష్టించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె చీఫ్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా ఆమె పని చేశారు.