32.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలి: సీఎం కేసిఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: ధరణిని బంగాళాఖాతంలో కలుపుదామంటున్న కాంగ్రెస్ ను బంగాళాఖాతం కలపాలని నిర్మల్ బహిరంగసభ వేదికగా పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. నేడు నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం.. పైరవీ లేకుండా, కష్టం లేకుండా రైతు ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతు భీమ సైతం ఇబ్బందులు లేకుండా నేరుగా రైతు కుటుంభానికి చేరుతున్నాయని.. ఇది కేవలం ధరణి పోర్టల్ వల్లే సాధ్యమైందని అన్నారు. మహారాష్ట్ర వాసులు సైతం బీఆర్ఎస్ కు హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నారని… తమ ప్రభుత్వం పై వారు ఆసక్తితో ఉన్నారని తెలిపారు. కుల మత వర్గ బేధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. గతంలో కలుషిత నీటితో వ్యాధుల బారిన పడ్డ ప్రాంతం అదిలాబాద్ అని గుర్తుచేశారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 4 మెడికల్ కాలేజీలు జిల్లాకోకటి చొప్పున అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఎవడో ఏదో చెబుతుంటారు.. మీరు వారికి బుద్ది చెప్పాలి..అందరినీ ఆదుకుంటూ అభివృద్ధిలో ముందుకుపోతున్న తమని మళ్ళీ ఆశీర్వదించాలని సీఎం ప్రజలకు తెలియజేశారు.

Latest Articles

వరంగల్ పోచమ్మ మైదాన్‌లో అగ్నిప్రమాదం

         వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ సమీపంలో నాలుగు అంతస్తులున్న జకోటియా కాంప్లెక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో చెలరేగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్