స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్, బీజేపీలకు దశాబ్ది ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ఉద్యమంలో నాడు రెండు పార్టీలు కలిసి రాలేదు. నేడు ఉత్సవాలకు రావడం లేదన్నారు. బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఉద్యమంలో రాజీనామాకు ఆయన భయపడ్డాడని గుర్తుచేశారు. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని ఉత్సవాలు చేస్తారా? కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.. కానీ ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు హరీష్ రావు.