స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో వేడుకల నిర్వహణ, ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. సమీక్ష అనంతరం దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ ప్రణాళిక చేస్తారు. మంత్రులు, ఉన్నతాధికారుల సలహాలు సూచనలు అనంతరం సీఎం కేసీఆర్ తుది రూపు ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే జూన్ 2 నుంచి 21 వరకు వైభవోపేతంగా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలు నిర్వహించేందుకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.