40.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్ష

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌పై శనివారం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సమీక్షలో వేడుకల నిర్వహణ, ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. సమీక్ష అనంతరం దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ ప్రణాళిక చేస్తారు. మంత్రులు, ఉన్నతాధికారుల సలహాలు సూచనలు అనంతరం సీఎం కేసీఆర్ తుది రూపు ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే జూన్ 2 నుంచి 21 వరకు వైభవోపేతంగా రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలు నిర్వహించేందుకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

Latest Articles

బీజేపీ, కాంగ్రెస్‌కు ఈసీ నోటీసులు

లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్‌ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్