కాంగ్రెస్ పార్టీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Venkat Reddy)పై కేసు నమోదైంది. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పుత్రుడు సుహాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఐపీసీ 506 సెక్షన్ కింద కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే అతని కార్యకర్తలు, అభిమానులు చెరుకు సుధాకర్ ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారని బెదిరించిన ఆడియో సోమవారం వైరల్ అయింది.
ఈ వ్యవహారంపై చెరుకు సుధాకర్, తన పుత్రుడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఈ విషయంపై భావోద్వేగంతోనే తాను వ్యాఖ్యలు చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.