బీఆర్ఎస్(BRS) అంటేనే.. భారత ” రైతు ” సమితి అని ఐటీ మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. రైతు బాధలను వింటున్న కేసీఆర్ ఫోటోను జోడిస్తూ.. ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఒక్క తెలంగాణలోనే మన అన్నదాతకు పెట్టుబడికి రూ.పదివేలు, పంట నష్టపోతే రూ.పదివేలు. అందుకే మన రైతన్న మనోగతం “ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు… మాకు అదే పదివేలు” వేరేటోళ్ళను పొరపాటున నమ్మినా… తెలంగాణ మళ్ళీ వెనక్కి.. వందేళ్లు అంటూ వివరించారు. మొదటి సారి కౌలు రైతులకు మేలు చేసే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.10వేలు ఇస్తామని సీఎం ప్రకటించడంతో కౌలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రాహుల్ గాంధీపై అనర్హత వేటు
Follow us on: Youtube Instagram