33.2 C
Hyderabad
Monday, June 5, 2023

వరుడికి షాక్.. కట్నం సరిపోలేదని పెళ్లి ఆపేసిన వధువు

Medchal |కట్నం సరిపోలేదని వరుడు పెళ్లి ఆపేసిన ఘటనలు చాలా చూశాం. కానీ ఓ పెళ్లి మాత్రం ఊహించని ఘటనతో ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని వధువు పెళ్లికి నో చెప్పేసింది. ఈ వింత ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో వివాహం కుదిరింది. అమ్మాయికి ఎదురుకట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం జరిగింది.

ఈ నెల 9న రాత్రి 7 గంటల 21 నిమిషాలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్​కు చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి రాకపోవడంతో వరుడి కుటుంబసభ్యులు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అమ్మాయి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కానీ వారు ససేమిరా అనడంతో పెళ్లి ఆగిపోయింది. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.

Read Also: ఇలాంటి సీఎంని నేనెక్కడ చూడలేదు: కన్నా లక్ష్మీ నారాయణ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్ ముఖ్య అతిథిగా చినజీయర్‌ స్వామి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం గురించే చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్