25.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

బండి సంజయ్ తో ఎలాంటి విభేదాలు లేవు: ఈటల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల కోసం పనిచేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీలో తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాగా పనిచేస్తున్నారని.. సంజయ్ తో తనకు ఎలాంటి వివాదం జరగలేదని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని స్పష్టంచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్‌ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లారని ఈ సందర్భంగా ఈటల గుర్తుచేశారు.

ఇక ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. కేవలం తన కుటుంబ సభ్యుల భూముల కోసమే జీవో111 ఎత్తివేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూముల స్కాంతో వచ్చిన డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన లాంటి వారిని ఓడించేందుకు ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈటల వెల్లడించారు.

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్