స్వతంత్ర, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కౌంటర్ అటాక్ కు ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వస్తు ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. బీఆర్ఎస్ ను రివర్స్ ఎటాక్ చేయాలని బీజేపీ కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తుంది. జూన్ 12 న తెలంగాణ రన్ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించగా.. అదే రోజు రివర్స్ రన్ కార్యక్రమం చేయాలని బీజేపీ నిర్ణయించింది. మొత్తంగా 15 అంశాలపై ఆందోళనలు చేపట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన కార్యక్రమం చేస్తే.. అవినీతి అక్రమాలపై ప్రదర్శనలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కార్యక్రమాల రూపకల్పన పై చర్చించారు.