స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్ లో నిలిచాయి. ఈనెల 1 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.23 కోట్ల బీరు సీసాల విక్రయం జరిగినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. మద్యం ప్రియులు భారీగా బీర్లు సేవించడంతో ప్రభుత్వానికి 582.99 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మరో రెండు వారాల్లో కూడా అమ్మకాలు పెరుగనున్నట్లు తెలిపారు.