Telangana: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు గవర్నర్ తమిళిసై. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్కు గవర్నర్ లేఖలు రాశారు. పేపర్ లీకేజీ అంశంలో సిట్ దర్యాప్తు నివేదికను పొందుపరచాలని ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో తెలిపారు. ఉద్యోగుల ఫలితాలతో సహా అన్ని వివరాలు నివేదికలో ఖచ్చితంగా పొందుపరచాలని ఆదేశించారు.