33.2 C
Hyderabad
Monday, June 5, 2023

భారీ అగ్ని ప్రమాదం.. నివాస గృహాలను ఖాళీ చేయించిన అధికారులు

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పరిధిలో ఆదివారం (మార్చి 12) రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మీర్ ఆలం పార్క్‌ సమీపంలోని ఓ కట్టెల గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గౌడౌన్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు కూడా చేరుకొని.. సహాయక చర్యలను ప్రారంభించారు. అయితే కట్టెలు అడ్డుగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. సిబ్బంది, పోలీసులు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా గోడౌన్‌కు చుట్టుపక్కల వున్న నివాస గృహాలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Latest Articles

‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్ ముఖ్య అతిథిగా చినజీయర్‌ స్వామి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం గురించే చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్