Site icon Swatantra Tv

సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం – సజ్జల

     సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడి పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేదన్నారు. ఎయిర్‌గన్‌ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉందని చెప్పారు. చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదన్నారు. ఇది కోల్డ్‌ బ్లడెడ్‌ పక్కా ప్లాన్‌ మర్డర్‌ అటెంప్ట్‌ అని అన్నారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడు, ప్రజలు ఆశీస్సు లతో జగన్‌ క్షేమంగా ఉన్నారని సజ్జల అన్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగిం దని సజ్జల అన్నారు. అందుకే కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడని మండి పడ్డారు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ దాడి చేశారని తెలిపారు. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు అని చెప్పారు.

 

Exit mobile version