Site icon Swatantra Tv

హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీం సంచలన తీర్పు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు సొసైటీలకు కేటాయించిన భూములను సుప్రీం రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు భూ కేటాయింపుల‌ను ర‌ద్దు చేస్తూ తుది తీర్పును వెల్ల‌డించింది. ఇటీవ‌ల‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలో సభ్యులకు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఇళ్ల స్థలాలు కేటాయించింది. సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఇళ్ల‌ స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం అంద‌జేశారు. అయితే తాజా సుప్రీంకోర్టు తీర్పుతో హౌసింగ్‌ సొసైటీలు పొందిన ఈ భూముల విషయమై సందిగ్ధత‌ నెలకొంది.

Exit mobile version