Site icon Swatantra Tv

Stock Markets| భారీగా పతనమైన దేశీయ సూచీలు.. తీవ్ర నష్టాల్లో కంపెనీలు

Business| దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వరుసగా నాలుగవరోజు కూడా నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఇదే ట్రేడింగ్ కొనసాగింది. దీంతో మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 927 పాయింట్లు నష్టపోయి 59,744 దగ్గర నిలవగా.. నిఫ్టీ 272 పాయింట్లు పతనమై 17,554 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.85గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ మాత్రమే లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి.

Exit mobile version