స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ సూపర్ రికార్డు నమోదుచేసింది. చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచును జియో సినిమాలో 2.5కోట్ల మంది వీక్షించారు. ఏప్రిల్ 17న జరిగిన చెన్నై-బెంగళూరు మ్యాచ్ను 2.4కోట్ల మంది చూశారు. దీంతో క్వాలిఫయర్ మ్యాచ్ ఈ రికార్డును బద్దలుకొట్టింది. ఈ మేరకు జియో సినిమా తన ట్విటర్లో పోస్టు చేసింది. కీలకమైన నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచుల ఆరంభంలోనే రికార్డును బ్రేక్ చేశాం. గుజరాత్-చెన్నై మ్యాచ్ను అభిమానులు విశేషంగా ఆదరించారని పేర్కొంది. కాగా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు కలిపి దాదాపు 1300కోట్ల వీడియో వ్యూస్ను జియో సినిమా రాబట్టింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టుపై చెన్నై గెలిచి ఫైనల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ధోని సేన ఏకంగా పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
Game 1️⃣ of 4️⃣ epic finishes to go… and we are breaking records and HOW! 🤩
We witnessed yet another high of concurrent viewers during the #Qualifier1 between Gujarat Titans & CSK 📈
More to soar 💪#GTvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/eTsTMuxTZX
— JioCinema (@JioCinema) May 23, 2023