Site icon Swatantra Tv

నేడు మూడు ప్రాంతాల్లో ‘సామాజిక సాధికార యాత్ర’

స్వతంత్ర వెబ్ డెస్క్: వైసీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార యాత్ర’ నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో గజపతినగరం, మద్యాంధ్రలో నరసాపురం, దక్షిణాంధ్రలో తిరుపతి నియోజకవర్గాల్లో ఇవాళ బస్సు యాత్ర జరగనుంది. ఈ యాత్రకు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు నేతృత్వం వహించనున్నారు. సాయంత్రం మూడు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రసంగిస్తారు.

YSRCP Samajika Sadhikara Yatra
రాయలసీమలో తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో జరిగే వైసీపీ సామాజిక సాధికార యాత్రలో కీలక నేతలు పాల‌్గొంటారు. వైసీపీ సామాజిక సాధికార యాత్రలో విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనీల్ యాదవ్, మార్గాని భరత్, ఇతర నేతలు పాల్గొననున్నారు.

సామాజిక సాధికార యాత్రషెడ్యూల్
* నేడు ఉదయం 9 గంటలకు జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు
* బాలాజీ కాలనీ నుంచి వైఎస్ఆర్ మార్గ్ వరకు మూడున్నర కిలో మీటర్ల పాదయాత్ర
* మధ్యాహ్నం 1 గంటకు కొత్తపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భోజన విరామం
* 3 గంటలకు రామానుజ సర్కిల్ నుంచి తుడా వరకు పాదయాత్ర
* సాయంత్రం 4.30 కు టాటా నగర్ లోని పెదకాపు వీధిలో పబ్లిక్ మీటింగ్

Exit mobile version