Site icon Swatantra Tv

అనంతపురంలో సింగనమల టిడిపి కార్యకర్తల ఆందోళన

        తెలుగుదేశం పార్టీ అనంతపురం కార్యాలయంలో సింగనమల టిడిపి కార్యకర్తలు ఆందోళన చేప ట్టారు. చంద్ర బాబు, నారా లోకేష్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారి శ్రావణికి టికెట్ కేటాయించడం తీవ్రంగా ఖండి స్తున్నారు. టూ మెన్ కమిటీ సభ్యులతో మాట్లాడకుండా ఏకపక్షంగా టికెట్ నిర్ణయించడం సరైంది కాదని మండిప డుతున్నారు. పార్టీకి ముకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్దమయ్యారు. టూమెన్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి సింగనమలలో తెలుగుదేశం పార్టీకి ఓటమి లేదని నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ,బాదుడే బాదుడు కార్యక్రమం, బాబు గ్యారెంటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం, లోకేష్ పాదయాత్ర కార్యక్రమం కూడా ఐదు రోజులు పాటు దిగ్విజయంగా సింగనమల నియోజకవర్గంలో సాగింది.

 

 

Exit mobile version