Site icon Swatantra Tv

ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో షర్మిల రోడ్‌షో

వైసీపీ ఎమ్మెల్యేలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో రోడ్ షో నిర్వహించిన షర్మిల … కార్మిక శాఖమంత్రిగా గుమ్మనూరు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వైఎస్‌ శిలాఫలకం వేసిన ప్రాజెక్టుకు జగన్‌ మళ్లీ శిలాఫలకం వేశారని విమర్శించారు. ల్యాండ్‌, శాండ్‌ మాఫియా అన్నీ చేసి దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని షర్మిల చెప్పారు.

Exit mobile version