Site icon Swatantra Tv

నేటి నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు అలెర్ట్. నేటి నుంచి ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌ హాజరు నిబంధనలు పాటించాల్సిందేనని టీచర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దింతో ఇవాళ్టి నుంచి విద్యార్థులు పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపటి నుండి స్కూలు మరియు కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టితో దసరా సెలవులు పూర్తి అవుతాయి. ఇక రేపటి నుంచి యధావిధిగా స్కూల్లు మరియు కాలేజీలకు విద్యార్థులు పోవాల్సి ఉంటుంది. దసరా మరియు బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని స్కూళ్లకు ఈనెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అలాగే కాలేజీలకు ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇవాల్టితో… బతుకమ్మ మరియు దసరా సెలవులు పూర్తికానున్నాయి. ఇక రేపటి నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి.

Exit mobile version