Site icon Swatantra Tv

రామాయణం తియ్యబోతున్న రాకింగ్ స్టార్ యష్

ఇప్పటి వరుకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఏది కచ్చితమైన రామాయణం అనేది తెలిదు. కాని ఇప్పుడు అసలైన రామాయణాన్ని తియ్యబోతున్నాం అని రెండు నిర్మాణ సంస్థలు ఒకటయ్యాయి. అవే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్. రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నాయి.

మంచి విజన్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి రామాయణాన్ని నితేష్ తివారి దర్శకత్వంలో తీసుకురాబోతున్నారు. DNEG విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పటి వరకూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని చెబుతున్నారు.

నమిత్ మల్హోత్ర మాట్లాడుతూ ‘‘US, UK, ఇండియా ఇలాంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు వెళ్లి, ఇలా నా జీవితంలో నేను చేసిన జర్నీ ప్రకారం ఇప్పుడు నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అనిపిస్తోంది. ఎక్కడో కర్ణాటక నుండి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరకు యష్ చాలా కష్టపడ్డాడు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌ను ప్రపంచ వేదిక మీద ప్రెజెంట్ చెయ్యాలంటే అది యష్ లాంటి వారితోనే సాధ్యం.’’ అని చెప్పారు.

యష్ మాట్లాడుతూ ‘‘మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలనేది నాకు ఎప్పటి నుండో ఉన్న కల. నమిత్, నేను రామాయణం చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మాములు విషయం కాదు. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం అనేది మన జీవితాలకు ముడి పది ఉంటుంది. మనం నమ్ముతున్నాం, మనకి రామాయణం తెలుసు, అందులో జ్ఞానం, భావజాలం ఇలా ఎన్నో లేయర్స్ ఉంటాయి. మా విజన్ ఏంటి అంటే గ్లోబల్ స్టేజి మీద ఈ అద్భుతమైన రామయణాన్ని వెండితెర మీద చూపించాలి. అందులో ఉన్న ఎమోషన్స్, వాల్యూస్ అన్ని కూడా.. రామాయణం జర్నీని ప్రపంచమంతా చూపించాలి.’’ అని వెల్లడించారు.

Exit mobile version