రాజ్తరుణ్- లావణ్య టాపిక్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. రాజ్తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనతో పదేళ్లుగా రిలేషన్లో ఉండి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు చేసింది. తర్వాత లావణ్య, మాల్వీ ఒకరి పై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటుండడంతో ఈ కేసు రోజుకో మలుపులు తిరుగుతూ కొత్త టర్న్ తీసుకుంది.
ఎట్టకేలకు సినీ నటుడు రాజ్తరుణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ ఘటన టాలీవుడ్లో సంచలనంగా మారింది. మరోసారి లావణ్య రాజ్తరుణ్-మాల్వీలపై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా పోలీసులకు కొన్ని ముఖ్య ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిలో రాజ్ తరుణ్తు ఉన్న 170 ఫొటోలు, ఇంకా పలు టెక్నికల్ అండ్ మెడికల్ ఎవిడెన్స్లు అందజేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్తరుణ్పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే రాజ్తరుణ్తో పదేళ్ల క్రితమే పెళైందని.. పదేళ్లుగా కాపురం చేశామని.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందించినట్లు తెలిపింది. అంతేకాకుండా చాలాకాలం అన్విక పేరుతో కలిసి ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. కొంతకాలం క్రితం మాల్వీ మల్హోత్రా వచ్చాక రాజ్తరుణ్ తనను దూరం పెట్టాడని.. మాల్వీ కోసం రాజ్తరుణ్ ముంబైలో ఎక్కువగా ఉంటున్నాడని తెలిపింది. అతను ఎప్పుడెప్పుడు ముంబైకి వెళ్లింది.. ఎవరింటికి వెళ్లింది.. ఎన్ని రోజులు ఉన్నాడు అనే చాలా విషయాలకు సంబంధించి అధారాలు ఉన్నట్లు లావణ్య తెలిపింది. మాల్వీ మల్హోత్రా తనని చంపేస్తానని బెదిరించిందన్నారు. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారు. అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పింది. తనని రాజ్తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో తెలిపింది.
మరో వైపు మస్తాన్తో సంబంధం ఉందనే ఆరోపణలపై కూడా లావణ్య వివరణ ఇచ్చింది. మస్తాన్ సాయికి తనకు గొడవైందని.. అందుకే అతనిపై ఫిర్యాదు చేశానంది. కొందరు తనతో మైండ్గేమ్ ఆడారని.. ఆ గేమ్లో తను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమేనని తెలిపారు. తను మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదని.. ఒక పెళ్లికి మాత్రం గుంటూరు కలిసి వెళ్లామని తెలిపింది. మస్తాన్ సాయి కేవలం మ్యూచ్వల్ ఫ్రెండ్ మాత్రమేనంటూ చెప్పుకొచ్చింది. రాజ్తరుణ్కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తన దగ్గర రాజ్తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని.. డబ్బుల కోసం తనను బెదిరించాల్సిన అవసరం లేదని తెలిపింది. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇదిలా వుంటే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య అనుచిత మెసేజ్లు పంపుతోందని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి ఫిర్యాదులో పేర్కొంది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.