Site icon Swatantra Tv

బ్రెజిల్ లో వర్షాల బీభత్సం

   బ్రెజిల్‌ దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 39కి చేరుకోగా, మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. భారీ వర్షాల నేపథ్యం లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సోషల్ మీడియా వేదికగా స్పందిం చారు. మరణించిన వారి కుంటుం బాలకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. దీంతోపాటు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version