24.2 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు

పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. బార్మల్‌ జిల్లాలో పక్తికా ప్రావిన్స్‌లోని ఏడు గ్రామాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడులకు పాకిస్థాన్ యుద్ధ విమానాలే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు చెప్పారు.

మరోవైపు ఈ చర్యను తాలిబన్ రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది. దీనికి ప్రతికారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. సరిహద్దు సమీపంలోని తాలిబన్ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడులు తామే చేశామని పాక్‌ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాక్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తాలిబన్‌ ఖండించింది. ఈక్రమంలో పాక్‌ వైమానిక దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి.

Latest Articles

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని... రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు...ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్