కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు మాఫియాపై స్వతంత్ర టీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఆల్ఫ్రోజోలం, యూరియా, డైజోఫార్మ్, శాక్రీన్ వంటి హానికర మత్తు పదార్థాలకు కలుపుతూ ప్రజల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేదిత పదార్థాలు వాడిన వారిని వదిలిపెట్టేదిలేదంటూ ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లు వేయించారు. కల్తీ కల్లు అమ్ముతున్న వారిపై పలు కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా కల్తీ కల్లు విక్రయాలు చేపడు తున్న వారిపై కేసులు నమోదు చేసి పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. మత్తు పదార్థాలతో ఎవరు దొరికినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కల్తీ కల్లు మాఫియాపై స్వతంత్ర టీవీ కథనాలకు అధికారుల స్పందన
![](https://swatantralive.com/wp-content/uploads/2024/04/kallu.jpg)