కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాన్వాయ్ మీదకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ దేవనాగరి జిల్లాలో నిర్వహించిన రోడ్డు షో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఓ యువకుడు బారీకేడ్లను దాటుకుంటూ కాన్వాయ్ మీదకు ఒక్కసారిగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొప్పాల్ జిల్లాకు చెందిన ఆ యువకుడిని బీజేపీ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. కాగా మోదీ పర్యటనలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని హుబ్బలిలో నిర్వహించిన రోడ్షోలో కూడా ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.