29.2 C
Hyderabad
Monday, May 29, 2023

ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు ప్రసవం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒకే కాన్పులు కవలలు జన్మించడం చూస్తూ ఉంటాయి. కొన్నిసందర్భాల్లో ముగ్గురు కూడా జన్మించడం చూసే ఉంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ఐదుగురు ఆడపిల్లలే కావడం విశేషం. జార్ఖండ్‌లోని చాటర్‌కు చెందిన అనితా కుమారి(27) అనే మహిళ ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు కాన్పు చేయగా ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే పిల్లలు తక్కువ బరువు ఉండడంతో వారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU)లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఒకే ప్రసవంలో ఐదుగురు పిల్లలు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుందని వెల్లడించారు.

Latest Articles

మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన తిరుగుబాటుదారులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఒక్క రోజే 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్