స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒకే కాన్పులు కవలలు జన్మించడం చూస్తూ ఉంటాయి. కొన్నిసందర్భాల్లో ముగ్గురు కూడా జన్మించడం చూసే ఉంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ఐదుగురు ఆడపిల్లలే కావడం విశేషం. జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి(27) అనే మహిళ ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు కాన్పు చేయగా ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే పిల్లలు తక్కువ బరువు ఉండడంతో వారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU)లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఒకే ప్రసవంలో ఐదుగురు పిల్లలు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుందని వెల్లడించారు.
रिम्स के महिला एवं प्रसूति विभाग में इटखोरी चतरा की एक महिला ने पांच बच्चों को जन्म दिया है। बच्चें NICU में डाक्टरों की देखरेख में हैं। डॉ शशि बाला सिंह के नेतृत्व में सफल प्रसव कराया गया। @HLTH_JHARKHAND pic.twitter.com/fdxUBYoPoP
— RIMS Ranchi (@ranchi_rims) May 22, 2023