స్వతంత్ర, వెబ్ డెస్క్: పార్లమెంట్ కొత్త భవనంపై ఆర్జేడీ ట్వీట్ దుమారం రేపుతుంది. పార్లమెంట్ నూతన భవనం ఆకారం శవపేటికలా ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆర్జేడీ ట్వీట్పై అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.