34.2 C
Hyderabad
Monday, May 29, 2023

OYO సీఈవో రితేశ్‌ అగర్వాల్ ఇంట తీవ్ర విషాదం

OYO Founder Ritesh Father Died: ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్ ఇంట విషాదం నెలకొంది. 20వ అంతస్తు నుంచి పడి అతడి తండ్రి రమేశ్‌ అగర్వాల్‌ మృత్యువాత పడ్డారు. రితేశ్‌ వివాహం జరిగిన మూడు రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 54లోని DLFకు చెందిన ది క్రెస్ట్‌ సొసైటీలో రితేశ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రమేశ్‌ అగర్వాల్‌ 20వ అంతస్తు నుంచి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, ఎలాంటి సూసైడ్‌ నోటు కూడా లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా మార్చి 7న ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో రితేశ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్‌, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ, లెన్స్‌కార్ట్‌ నిర్వాహకులు పీయూష్‌ బన్సల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు హాజరయ్యారు.

Latest Articles

అదరగొట్టిన మామా అల్లుడి ‘బ్రో’ పోస్టర్

స్వతంత్ర వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తూనే ఉన్నాడు. వరుసపెట్టి తన సినిమాల అప్టేడ్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. మేనల్లుడు సాయితేజుతో కలిసి నటిస్తున్న 'బ్రో ది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్