35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్‌ 8వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి  ప్రతిపక్షాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మాత్రమే హాజరవుతుండడం విశేషం. మరోవైపు మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ సీఎంలతో పాటు యూపీఏ భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవుతారని నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పినా చివరి నిమిషంలో ఆయన కూడా దూరంగా ఉండాలని భావించారు. తొలుత నీతి ఆయోగ్‌ భేటీకి హాజరై.. తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుకున్నారు. అయితే ఆమె కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా 2045 కల్లా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ రూపకల్పనకు ఈ సమావేశం ఉపయోగపడనుందని నీతి ఆయోగ్‌ ఓ ప్రకటన జారీచేసింది.

Latest Articles

‘ఫ్యామిలీ స్టార్’ను కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు: డైరెక్టర్ పరశురామ్

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్