కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్ సభ సచివాలయం నిర్ణయానికి వ్యతిరేకంగా 14 ప్రతపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా(Om Birla)పై అవిశ్వాస తీర్మానం(Motion Of Confidence) పెట్టడానికి విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం ఆయనపై ఈ తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాహుల్ కు శిక్ష పడిన వెంటనే ఆయనపై చర్యలకు స్పీకర్ బిర్లా తొందరపడారని మండిపడుతున్నాయి. అందుకే ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్షాలు డిసైడ్ అయినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.