32.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ గుండెపోటుతో మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటించారు. దీంతో జూన్‌ 5 నుంచి ఆగస్ట్‌ 3 వరకు సంస్మరణ సభలు నిర్వహించాలని మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ ప్రస్తుతం మావోయిస్టు పొలిటికల్‌ బ్యూరో సెంట్రల్‌ కమిటీలో బస్తర్‌ సభ్యుడిగా ఉన్నారు. ఉద్యమాలకు ఆకర్షితుడైన ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితమే అందులోకి వెళ్లారు. అనంతరం అంచెలు అంచెలుగా ఎదుగుతూ పార్టీలో కీలక సభ్యుడిగా మారారు.

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్