Chandigarh Liquor Policy |మందుబాబులకు ఇంకా కిక్కే కిక్కు. తెల్లవారుజామున దాకా మందే మందు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కొత్త నిర్ణయం మద్యం ప్రియులకు ఫుల్ కిక్కు ఇస్తోంది. అదేటంటే తెల్లవారుజామున 3గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకోవచ్చని కొత్త ఎక్సైజ్ పాలసీ(liquor policy) 2023-24 జీవో జారీ చేసింది. అలాగే ఇప్పటి వరకు మద్యంపై ఉన్న కౌ-సెస్ తగ్గించి క్లీన్ ఎయిర్ సెస్ అందుబాటులోకి తెచ్చింది. స్వదేశం లిక్కర్ 750ml బాటిల్ పై కౌ సెస్ రూ.1కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎక్సైజ్ పాలసీలోనూ ఎలాంటి మార్పు తీసుకురాలేదు. తక్కువ ఆల్కహాల్ ఉంటే బీర్స్, వైన్స్ వంటి వాటిపై కూడా లైసెన్స్ ఫీజు పెంచలేదు.
Read Also: రైతుల కోసం కేంద్రప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమిటో తెలుసా..
Follow us on: Youtube