స్వతంత్ర వెబ్ డెస్క్: స్వతంత్ర, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్లోని బింద్లో భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరల్లో సాంకేతిక సమస్య తలెత్తడాన్ని గుర్తించిన పైలట్.. వెంటనే అప్రమత్తమై హెలికాప్టర్ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే ముందుగానే గమనించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని లేదంటే.. పెను ప్రమాదమే జరిగేదని వివరించాడు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ల్యాండైన AH-64 అపాచీ హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన హెలికాప్టర్ గా పేరుపొందింది. ఇది మల్టీరోల్ ఆపరేషన్లలో ఉపయోగించబడుతుంది. ఇలాంటి హెలి క్యాప్టర్ లు భారత వైమానిక దళానికి 22 వరకు ఉన్నాయి.