స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఈనెల 28న జరగబోయే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్షాలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటంపై అభ్యంతరం చెప్పాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఎలాంటి విలువ లేదని విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం బహిష్కరించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, DMK, ఆప్, శివసేన(UBT), TMC, NCP,JDU, RJD, SP, CPI, CPM, RDL, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్(మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, MDMK ఉన్నాయి. అయితే ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ మాత్రం ఈ కార్యక్రమానికి తాము హాజరువుతున్నామని తెలిపాయి.
Congress, 18 other parties to boycott inauguration of new Parliament building, accuse government of "sidelining" President Murmu
Read @ANI Story | https://t.co/s8d1Dyk0YD#PMModi #PresidentMurmu #ParliamentBuilding #NewParliamentBuilding pic.twitter.com/2BiGd2Cli6
— ANI Digital (@ani_digital) May 24, 2023