32.2 C
Hyderabad
Sunday, June 11, 2023

జీ-20 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ తరపున అతిథిగా హాజరయ్యారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చెర్రీకి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం జీ-20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్న చరణ్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు కూడా వేశారు.

                                     

ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెర్రీకి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు. అనంతరం వేదికపై పలు అంశాల గురించి చరణ్ మాట్లాడారు. ఈ వేదికకు తనను ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest Articles

గ్రూప్ – 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు. 2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్