Site icon Swatantra Tv

డా.సుప్రీమ్‌ చేతుల మీదుగా ‘నట రత్నాలు’ సెకెండ్‌ లిరికల్‌ సాంగ్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: మర్డర్‌ మిస్టరీ క్రేౖం థ్రిల్లర్‌గా శివనాగు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నట రత్నాలు’. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నటనటనటరత్నాలు ఛాన్స్‌ ఇస్తే పండిస్తా నవరసాలు’’ అంటూ సాగే సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ను డా. సుప్రీం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర పాల్గొన్నారు. శంకర్ మహాదేవ్ స్వరకల్పనలో వినాయక్‌ ఈ పాటను ఆలపించగా.. సీతారామ చౌదరి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల ముందు తాగుబోతు రమేశ్‌పై తెరకెక్కించిన పాటను విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్, అర్జున్‌ తేజ్‌లపై తెరకెక్కించాం. ఈ పాటకు కూడా స్పందన బావుంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా స్పందన బావుంది. సినిమా అవుట్‌పుట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్ట్‌లో మంచి డేట్‌ చూసి సినిమా విడుదల చేస్తాం. పాటను విడుదల చేసిన సముద్ర, సుప్రీమ్‌గారికి కృతజ్ఞతలు. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అని అన్నారు.

వి.సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్‌ వింటుంటూ సూపర్‌హిట్టైన జాతిరత్నాలు సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచి నాకు తెలుసు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. చక్కని ఆర్టిస్ట్‌లు నటించారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అని అన్నారు. ఇంకా డా.సుప్రీమ్‌ బాబు మాట్లాడుతూ ‘‘సినిమా, పాటలు చూశా. చాలా బాగా వచ్చింది. నాన్న తన చిత్రాలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు. ఈ సినిమా కూడా ఆ తరహాలోనే చేశారు’ అని అన్నారు.

Exit mobile version