పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం జనసేన సీటుపై పందాలు జోరందుకున్నాయి. సీటు ఎవరికి దక్కుతుందో అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ముందుగా ప్రకటించిన విధంగా కొత్తపల్లి తాను అసెంబ్లీలో అడుగు పెడతానని కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే సీటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని వెన్నంటి ఉన్న బొమ్మిడి నాయకుర్కు సీటు ఇస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. జనసేన పార్టీలో ఇద్దరు వ్యక్తులు సీటు కోసం పోటీ పడుతుండడంతో వీరిలో ఎవరికి దక్కుతుందో అని నరసాపురంలో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి.
నర్సాపురం జనసేన సీటు ఎవరికి..?
![](https://swatantralive.com/wp-content/uploads/2024/02/pawan-1024x491.jpg)