ఎన్కౌంటర్లలో ఎక్కువమంది ఆదివాసీలే చంపబడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల హక్కులను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల 43వ వర్ధంతి సందర్భంగా అమరుల స్తూపం వద్ద సీతక్క నివాళులర్పించారు. ఆదివాసి గూడలో పెద్ద ఎత్తున బిఎస్ఎఫ్ సిబ్బందిని తీసుకువచ్చి ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేయిస్తోందని సీతక్క ఆరోపించారు.
ఎన్కౌంటర్లలో ఎక్కువగా చంపబడుతోంది ఆదివాసీలే – మంత్రి సీతక్క
![](https://swatantralive.com/wp-content/uploads/2024/04/seethalkka-.jpg)