Site icon Swatantra Tv

నేడు కవిత సీబీఐ విచారణ.. ఢిల్లీకి చేరుకున్న మంత్రులు

MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసు నేడు మరో కీలక మలుపు తిరుగనుంది. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత(MLC Kavitha)ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో ఆమె ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 10: 30  గంటల తర్వాత దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈనెల 9న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆరోజున విచారణకు హాజరు కాలేనని.. ఈనెల 11న విచారణకు హాజరుఅవుతానని కవిత ఈడీకి లేఖ రాశారు. కవిత ఈడీ విచారణ సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళా. ఢిల్లీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు వెళ్లారు. ఈరోజు మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.

Read Also:  బీజేపీలో చేరనున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

Follow us on:   Youtube   Instagram

Exit mobile version