Site icon Swatantra Tv

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌

     ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని లాస్య నివాసానికి వెళ్లిన కేటీఆర్‌.. నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని కేటీఆర్ చెప్పారు. విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు.

    లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని చెప్పారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. చిన్న వయసులోనే లాస్య రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. ఏడాది వ్యవధిలోనే సాయన్న, లాస్యలు మరణించడం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటు అని చెప్పారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం, మర్రి రాజ శేకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Exit mobile version