చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకుపైగా చెందిన ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ 2024 పోటీ పడ్డారు. చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది విజేత పోలాండ్కు చెందిన కరోలినా బియాలావ్స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబనాన్కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్గా నిలిచింది.
ఈసారి భారీ అంచనాలతో మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచిన భారత్కు నిరాశే ఎదురైంది. భారత్ నుంచి పోటీలో ఉన్న సిని శెట్టి 8 వ స్థానంలో నిలిచారు. తర దేశాల భామలకు సినీ శెట్టి గట్టి పోటీ ఇచ్చినా.. అజైటౌన్ టాప్-4 కు ఎంపిక కావడంతో సినీ శెట్టి వెనుదిరక తప్పలేదు. ఇక ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు.