ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్పై కూటమి అభ్యర్థి, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం పోవాలనే నిర్ణయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎన్టీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం తాను నిరంతరం పని చేస్తానన్నారు. కొట్టు సత్యనారా యణ ఓటమి భయంతో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
![](https://swatantralive.com/wp-content/uploads/2024/05/bolisetti.jpg)