Site icon Swatantra Tv

జగన్‌పై సీబీఐ విచారణ చేయించాలి – వై.ఎస్ షర్మిల

జగన్‌పై సీబీఐ విచారణ చేయించాలన్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ వై.ఎస్ షర్మిల. గౌతమ్ అదానీ నుంచి 17 వందల 50 కోట్ల మేర ముడుపులు అందుకున్న వ్యవహారంలో.. మాజీ సీఎం జగన్‌పై సిట్టింగ్‌ జడ్జితోపాటు సీబీఐతోనూ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు షర్మిల. నాటి జగన్ ప్రభుత్వం చేసుకున్న అక్రమ ఒప్పందాల కారణంగా ప్రజలపై లక్షన్నర కోట్లమేర భారం పడుతుందని ఆరోపించారామె. అందుకే వాటిని తక్షణమే రద్దు చేయాలని లేఖలో కోరారు షర్మిల.

Exit mobile version