Site icon Swatantra Tv

నా సొంత నిధులతో గృహాలు నిర్మిస్తా – టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి

   ఇల్లు లేని పేద ప్రజలకు తన సొంత నిధులతో పట్టాలు పంపిణీ చేసి గృహాలు నిర్మిస్తానని అన్నారు బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇళ్ల పట్టాల విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏనాడు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోలేదని అన్నారు. కానీ ఇళ్ల పట్టాలు లోతట్టు ప్రాంతాల్లో కాకుండా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని డిమాండ్ చేశానని తెలిపారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ప్రభుత్వ పరిధిలో కానీపక్షంలో తన సొంత నిధులతో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

Exit mobile version