Site icon Swatantra Tv

డబిల్ పూర్ లోని శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం

    మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ లోని హనుమాన్ గుట్టపై ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలను కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఘటన స్థలాన్ని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసిపి బి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట మందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగలను వీలైనంత త్వరగా పట్టుకొని తీరుతామని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్నట్టుగా చెప్పారు.

Exit mobile version